అమరావతి: సీట్ల కేటాయింపుపై అసెంబ్లీలో వాగ్వాదం తలెత్తింది. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి ఇంతకు ముందు అక్కడే కూర్చున్నారని.. ఆ సీటుపై కొంచెం వ్యామోహం ఉండవచ్చునని అన్నారు. ఇవాళ కొత్తగా ఆయన అక్కడ కూర్చోలేదని, అసెంబ్లీ ప్రారంభం అయిన దగ్గర నుంచి, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆయన అక్కడే కూర్చుంటున్నారని అన్నారు. ఆయన అక్కడ కూర్చోవడం తనకు తప్పు అనిపించలేదని అన్నారు. అయితే ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చోవాలని స్పీకర్ చెప్పగానే శ్రీధర్ రెడ్డి లేచి తన సీట్లో వెళ్లిపోయారని జగన్ చెప్పారు. అయిందేదో అయింది. ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చునని అనుకుందామా? అని జగన్, చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. అలా అనుకుంటే ఒక రూల్ తీసుకువద్దామని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm