లక్నో : సమాజ్వాదీ పార్టీ ఎంపి ఆజంఖాన్పై నమోదైన నకిలీ కేసులపై దర్యాప్తు జరపడానికి ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు అహ్మద్ హసన్ నేతృత్వంలో 21 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 20వ తేదీన ఈ కమిటీ రాంపూర్ వెళ్లి భూమి కబ్జా చేశారంటూ ఆజంఖాన్పై రైతులు పెట్టిన కేసులపై విచారణ జరుపుతారని సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధురి చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm