న్యూఢిల్లీ: ఆర్బీఐ వద్ద మిగులు రిజర్వును ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్పై ఏర్పాటు చేసిన బిమల్ జలాన్ కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ రోజు ఈ కమిటీ సమావేశమై నివేదికకు తుదిమెరుగులు దిద్దింది. త్వరలో ఈ నివేదికను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కు సమర్పించనుంది. ఆర్బీఐ వద్ద మిగులు నిధులను విడతల వారీగా మూడు నుంచి ఐదేళ్లలో ప్రభుత్వానికి బదలాయించాలి అని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కాకపోతే ఈ నివేదికపై ప్యానల్లోనే భిన్నాభిప్రాయలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఉన్న ఆస్తుల్లో 27 శాతం మిగులుగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు 14 శాతం రిజర్వును నిర్వహిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm