హైదరాబాద్ : పక్క రాష్ట్రాలతో వైసీపీ ప్రభుత్వం సఖ్యతగా ఉండడంతో టీడీపీ నేతలు బాధపడుతున్నారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ నదులు అనుసంధానిస్తే నీళ్లొస్తాయని అందరికీ తెలుసిన విషయమేనని అన్నారు. ఆనాడు ఓటుకు నోటు కేసులో పట్టుబడి.. రాత్రికి రాత్రే హైదరాబాద్ను విడిచి వచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు మనకు హైదరాబాద్ రాజధానిగా ఉందని బుగ్గన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm