అమరావతి : విజయవాడలో మధ్యాహ్నం 3 గంటల వరుకు నిప్పులు చెరిగిన భానుడు.. ఒక్కసారిగా చల్లబడ్డాడు. అకస్మాత్తుగా వాతావరణం మారి వర్షం కురిసింది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం అమరావతి అసెంబ్లీ వద్ద గాలి-వాన బీభత్సం సృష్టించింది. సెక్యూరిటీ ల కోసం వేసిన టెంట్లు కూలిపోవడంతో.. వర్షంలోనే సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Mon Jan 19, 2015 06:51 pm