హైదరాబాద్: గెలాక్సీ ఎ80 పేరిట ఓ నూతన స్మార్ట్ఫోన్ను శాంసంగ్ ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎ సిరీస్లో వచ్చిన టాప్ ఎండ్ గెలాక్సీ ఫోన్ ఇదే కావడం విశేషం. కాగా ఇందులో 8 జీబీ పవర్ఫుల్ ర్యామ్ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న రొటేటింగ్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో ఇదే కెమెరాను సెల్ఫీల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ రూ.47,990 ధరకు వినియోగదారులకు ఆగస్టు 1వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.
గెలాక్సీ ఎ80 స్మార్ట్ఫోన్లో 6.7 ఇంచుల డిస్ప్లే, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 730జి ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8 మెగాపిక్సల్ రొటేటింగ్ కెమెరాలు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, యూఎస్బీ టైప్ సి, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 18,2019 04:43PM