బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై జరుగుతున్న చర్చలో మరోసారి గందరగోళం నెలకొంది. గవర్నర్ను కలిసి వచ్చిన తర్వాత సభలో బీజేపీ సభ్యులు ధర్నా చేపట్టారు. పోడియం వద్దకు దూసుకొచ్చి నినాదాలు చేశారు. దీంతో అరగంట పాటు సభ వాయిదా పడింది. విశ్వాస పరీక్ష వెంటనే నిర్వహించాలంటూ బీజేపీ సభ్యులు సభను స్తంభింపజేసింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు, స్పీకర్ రమేష్కుమార్ మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. మీ ఇష్టానికి తగినట్లుగా సభ నడపడం కుదరదని స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే కర్ణాటక సంక్షోభంపై అడ్వకేట్ జనరల్తో స్పీకర్ భేటీ అయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm