హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనివిధంగా బిగ్ బాస్ నిర్వాహకులు చిక్కుల్లో పడ్డారు. తెలుగు బుల్లితెరపై గత రెండు సీజన్లుగా విజయవంతం అయిన బిగ్ బాస్ షో తాజాగా మూడో సీజన్ లోకి అడుగుపెడుతోంది. అయితే, బిగ్ బాస్ నిర్వాహకులు అవకాశం ఇచ్చే క్రమంలో లైంగిక వేధిస్తున్నారంటూ యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో వాదోపవాదాలు కూడా జరిగాయి. బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ వివాదం ఢిల్లీకి చేరింది. శ్వేతారెడ్డి, గాయత్రీగుప్తా తమకు ఎదురైన అనుభవాలను ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కమిషన్ సభ్యులను కోరారు. ఈ సందర్భంగా తమ ఫిర్యాదుకు ఎఫ్ఐఆర్ కాపీలను కూడా జత చేశారు. వీరిద్దరూ కొన్నిరోజుల క్రితం బిగ్ బాస్ నిర్వాహకులపై రాయదుర్గం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm