హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకంత హడావుడిని హైకోర్టు ధర్మాసనం సూటిప్రశ్న వేసింది. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు 109 రోజులు గడువు ఉండగా ఎందుకంత వేగంగా చేపట్టారని ప్రశ్నించింది. వార్డుల విభజన, ఇతర ప్రక్రియల్లో తప్పులు దొర్లుతున్నాయని, అయినా ఎందుకు ఎన్నికలు చేపట్టారో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి, తెలంగాణ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm