లక్నో: ఆస్తికోసం జరిగిన తగాదాలో ఒకరిని మరొకరు కాల్చుకొని 10 మంది మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోంభద్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోంభద్ర సమీపంలోని ఓ ఐఏఎస్ అధికారికి చెందిన 22 ఎకరాలను రెండు సంవత్సరాల క్రితం యాగ్య దత్ అనే వ్యక్తికి అమ్మారు. అయితే దత్ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గొడవలు చెలరేగాయి. బుధవారం వీరి మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు గ్రూపులు తుపాలకులతో ఒకరినొకరు కాల్చుకున్నారు. ఈ కాల్పుల్లో 10 మంది చనిపోగా 19 మంది గాయపడ్డారని రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ పేర్కొన్నారు. ఘోరవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల ప్రదేశంలో ఈ ఘర్షణ జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm