హైదరాబాద్: ఏపీ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 23న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 23న భువనేశ్వర్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకొని వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోనున్నారు. దర్శనానంతరం విజయవాడకు ప్రయాణమై ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత క్యాంపు కార్యాలయాన్ని రాజ్భవన్గా ఖరారు చేయనుండగా భవనంలోని మొదటి అంతస్థుని గవర్నర్ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 18,2019 06:05PM