హైదరాబాద్: ఈరోజు ఎన్నో కీలక మలుపులు తిరిగిన కర్ణాటక అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారంటూ మధ్యాహ్నం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్ ను వాయిదా వేయాలని నిరసనగా సభలో గందరగోళం సృష్టించగా బీజేపీ నేతలు గవర్నర్ ను కలిసి ఓటింగ్ కు ఆదేశించాలని కోరారు. రాజ్ భవన్ అధికారులు గవర్నర్ లేఖతో సహా విధాన సభలో స్పీకర్ తో చర్చలు జరిపి ఓటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అయితే స్పీకర్ మాత్రం నిరసనల మధ్య సభను రేపటికి వాయిదా వేశారు. అయితే బీజేపీ నేత యడ్యూరప్ప, ఇతర బీజేపీ సభ్యులు సభ వాయిదా పడినా సభలో ఉండి నిరసన తెలుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm