రాజన్న సిరిసిల్ల: చిన్నబోనాలులో స్వప్న అనే ఓ మహిళను గ్రామస్తులు చితకబాదారు. వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ ట్రాక్టర్కు కట్టేసి కొట్టారు. భర్తను వదిలి వేరే వ్యక్తితో ఇంట్లోంచి డబ్బులు తీసుకుని వెళ్లిపోయిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో నారాయణ అనే వ్యక్తితో స్వప్నకు గత కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. లక్షలకొద్దీ డబ్బులు నారాయణ ఆ మహిళకు ముట్టజెప్పాడని, కుటుంబసభ్యులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్వప్న భర్త బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లినప్పటి నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోందని అన్నారు. నారాయణ, స్వప్నను గ్రామస్తులు పట్టుకుని నిలదీశారు. దీంతో నారాయణ పారిపోగా స్వప్న ట్రాక్టర్కు కట్టేసి కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లగా గ్రామస్తులు అడ్డుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm