అమరావతి: పోలీస్ ఎంకౌంటర్లపై రెండు తెలుగు రాష్ట్రాలకు సుప్రీమ్ కోర్ట్ ఓ ఆదేశమిచ్చింది. పోలీసులు చేసే ఎంకౌంటర్లను ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కోర్టుకు తెలియజేయాలని సుప్రీమ్ తీర్పునిచ్చింది. పీపుల్స్ యూనియర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఎంకౌంటర్లపై కేసు నమోదు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని గతంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సుప్రీంను ఆశ్రయించగా ఈరోజు హైకోర్టు ఆదేశాలను అనుసరించాల్సిందేనని తీర్పునిచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm