హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢ మాసం బోనాల వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. గోల్కొండ కోటలో ఆషాడ బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. గోల్కొండ కోటలో ఆషాఢ మాసం సందర్బంగా ఇవాళ భక్తులు అమ్మవారికి 5వ బోనం సమర్పించుకున్నారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ల మధ్య భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి..మొక్కులు చెల్లించుకున్నారు. జూలై 4వ తేదీన ప్రారంభమైన బోనాల ఉత్సవాలు ప్రతి ఆదివారం, గురువారం అత్యంత సంబురంగా జరుగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm