ముంబై: భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. గురువారం అతడు, అతని భార్య అనుష్క శర్మ ముంబయి విమానాశ్రయంలో దిగారు. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. అయితే బీసీసీఐ వెంటనే టికెట్లు ఏర్పాటు చేయకపోయేసరికి భారత ఆటగాళ్లు కొన్ని రోజులు ఇంగ్లాండ్లోనే ఉండాల్సి వచ్చింది. కానీ రోహిత్ శర్మ అందరికంటే ముందుగానే స్వదేశానికి వచ్చాడు. వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును ముంబయిలో రేపు ఎంపిక చేయనున్నారు. తొలుత వెస్టిండీస్ సిరీస్కు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లుగా కొన్ని రోజులు వార్తలు వచ్చాయి. అయితే ఈ పర్యటనలో ఆడాలని విరాట్ నిర్ణయించుకున్నట్లు తాజాగా తెలిసింది. భారత్ వచ్చే నెలలో మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్లు విండీస్తో తలపడనుంది.
Mon Jan 19, 2015 06:51 pm