అనంతపురం: సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రూటు మార్చాలని ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ను తిరుపతి నుంచి పాకాల, మదనపల్లి, కదిరి, ధర్మవరం, అనంపురం మీదుగా నడపాలని కోరారు. అంతేకాక.. కదిరి నుంచి వయా పుట్టపర్తి మీదుగా బెంగళూరుకు రైలును నడపాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm