ఏలూరు : ఏసీ కంప్రెషర్ మరమ్మతులు చేస్తుండగా అది పేలి ముగ్గురికి గాయాలైన ఘటన ఏలూరులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని టూటౌన్ ప్రాంతంలో పత్తేబాద సమీపంలో ఏసీ కంప్రెషర్ మరమ్మతుల దుకాణంలో ఏసీ మరమ్మతులు చేస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో దుకాణ యజమాని కల్యాణ్, దుకాణంలో ఉన్న చందు, రఘు అనే మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ ఎక్కువై పేలిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm