లఖ్నవూ: తన వ్యక్తిగత భద్రతపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాశారు. తాను యూపీ పర్యటనకు వచ్చినపుడు కనీస భద్రత కల్పిస్తే చాలన్నారు. తాను రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు భద్రత కల్పిస్తున్నందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, కానీ తనకు కల్పించే భద్రత వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. తాను ప్రజల సేవకురాలినని, తన కారణంగా వారికి ఇబ్బందులు కలగకూడదని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm