విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతి శనివారం నగరంలోని రీజినల్ పాస్పోర్టు ఆఫీసుకు విచ్చేశారు. ఈసందర్భంగా డిప్లమేటిక్ పాస్పోర్టును సీఎం దంపతులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదా ఉన్నవారికి కేంద్ర విదేశాంగ శాఖ డిప్లమేటిక్ పాస్పోర్టును జారీ చేస్తుంది. గతంలో చంద్రబాబునాయుడికి ఈ పాస్పోర్టు జారీ చేయగా ఎన్నికలనంతరం ఆయన దానిని అధికారులకు అప్పగించారు. కాగా... ప్రస్తుతం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత శనివారం విజయవాడలోని ఎంజీ రోడ్డులోగల రీజినల్ పాస్పోర్టు కార్యాలయానికి చేరుకుని డిప్లమేటిక్ పాస్పోర్టును తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm