న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ ఎంపీ అజం ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1947 అనంతరం ముస్లింలు పాక్కు వలస వెళ్లకుండా.. భారతదేశంలోనే ఉంటామని నిర్ణయించుకోవడం వల్లే వారిపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని తమ దేశంగా భావించడం వల్లే తమ పూర్వీకులు పాకిస్థాన్కు వలస వెళ్లలేదని చెప్పారు. అంతే కాకుండా బీజేపీ రాంపూర్ ఎంపీ అభ్యర్థి జయప్రదపై పోటీ చేసి గెలిచినందుకు తనపై తప్పుడు కేసులు పెడ్తున్నారని అజం ఖాన్ ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm