హైదరాబాద్: హర్యానాలోని కైథల్లో ఒక మహిళ ఒక ఆడశిశువును ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి మురికి కాలువలో పారేసింది. ఆ శిశువును రెండు కుక్కలు బైటికి లాగాయి. ఇది సిసిటివి నమోదైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ శిశువును ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. శిశువు ప్రాణాలతోనే ఉందని, కాని ఆమె పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని కైథల్ పట్టణం ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. శిశువును బ్రతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm