ముంబై : మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే యశోమతి ముంబైలోని సెంట్ జార్జి ఆసుపత్రిలో పోలీసులతో వాగ్యుద్ధం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్కు అందుతున్న చికిత్స గురించి తెలుసుకోవడానికి ఆమె వచ్చారు. కాగా ఆమెను ఆసుపత్రి యాజమాన్యం, పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఆమె వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కార్డియాక్ వార్డు లేకుండా, చికిత్స ఎలా చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm