న్యూఢిల్లీ: త్రిపుర, పశ్చిమ బెంగాల్ కు నూతన గవర్నర్లను నియమిస్తూ కేంద్రం ఉత్వర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా జగదీప్ ధన్ఖర్ను, త్రిపుర గవర్నర్గా రమేష్ బైస్ను నియమించారు. ఫాగౌ చౌహాన్ బీహార్ గవర్నర్గా, ఆర్ఎన్ రవిని నాగాలాండ్ గవర్నర్గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ను బదిలీ చేసి ఉత్తరప్రదేశ్ గవర్నర్గా బీహార్ గవర్నర్ లాల్ జీ టాండన్ బదిలీ చేయబడి మధ్యప్రదేశ్ గవర్నర్గా నియమించారు. ఈ నియామకాలు వారు తమ కార్యాలయాలకు బాధ్యతలు స్వీకరించిన తేదీల నుండి అమలులోకి వస్తాయని కేంద్రం తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm