సూర్యాపేట: పవిత్ర హజ్ యాత్రకు సూర్యాపేట జిల్లా నుంచి వెళ్తున్న యాత్రా బృందానికి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నేడు ఘనంగా వీడ్కోలు పలికారు. సూర్యాపేట పట్టణంలో స్థానిక పబ్లిక్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు. హజ్ యాత్రికుల బృందాన్ని సంప్రాదాయ పద్దతిలో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హజ్ యాత్ర ముస్లిం సోదరుల స్వప్నం. భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం నిదర్శనం. సెక్యులరిజాన్ని కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. కొన్ని పెడసరి దోరణుల మధ్య సెక్యులరిజాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ముస్లిం సంక్షేమానికి బడ్జెట్లో రూ. 1000 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ అన్నారు. హజ్ యాత్ర నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని తిరిగి రావాలని మంత్రి ఆకాంక్షించారు.
Mon Jan 19, 2015 06:51 pm