విజయవాడ: అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని.. త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. శనివారం ఆమె విజయవాడలో జిల్లా అగ్నిమాపక కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 155 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది చేరుకోవాలంటే చాలా సమయం పడుతోందని.. అలాంటి చోట నూతన ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో అగ్నిప్రమాదాలు తగ్గినా.. పారిశ్రామిక వాడల్లో మాత్రం పెరుగుతున్నాయని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm