హైదరాబాద్: సింథటిక్ పాలు, పాల పదార్థాల తయారీ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్తో పాటు పలు రాష్ర్టాల్లో బ్రాండెడ్ ఔట్లెట్లలో వీటిని విక్రయిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 62 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. మొరీనా జిల్లాలోని అంబా, బింద్ జిల్లాలోని లహర్ ప్రాంతంలోని పరిశ్రమలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది నేడు దాడి చేశారు. సోదాల్లో పోలీసు సిబ్బంది సంఘటనా స్థలం నుంచి పలు రసాయనాలను, పది వేల లీటర్ల సింథటిక్ పాలు, 500 కేజీల పాల పొడి, 200 కేజీల సింథటిక్ వెన్నను స్వాధీనం చేసుకున్నారు. పెద్దమొత్తంలో లిక్విడ్ షాంపో, డిటర్జెంట్, రిఫనైడ్ ఆయిల్, సోడియం థయోసల్ఫేట్తో పాటు ఇతర రసాయనాలను సీజ్ చేశారు. అదేవిధంగా 20 ట్యాంకర్లు, 11 పాలతో కూడిన వ్యాన్లను సీజ్ చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ర్టాల్లో వీరు సింథటిక్ పాలను సరఫరా చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm