అమరావతి: జనసేన న్యాయ విభాగం సమన్వయకర్తగా సీనియర్ అడ్వొకేట్ సాంబశివ ప్రతాప్ నియమితులయ్యారు. ఆయన పేరును ఇవాళ పార్టీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకూ ఆయనే లీగల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తారు. న్యాయవాదిగా అపార అనుభవం ఉన్న సాంబశివ ప్రతాప్.. జనసేనకు మెరుగైన సేవలు అందిస్తారని పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో లీగల్ వింగ్ కార్యకలాపాలను ప్రతాప్ సమన్వయం చేస్తారని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm