హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు మామూలోలు కాదండోయ్. స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ తమపై వేసిన సెటైరుకు అంతేస్థాయిలో సమాధానమిచ్చారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని మూసాపేట్ శ్రీరాములు థియేటర్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా చూడ్డానికి ఆర్జీవీ మోటర్ సైకిల్పై వెళ్లారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ముందు ఒకరు బైక్ నడుపుతుండగా చివరలో ఆర్జీవీ ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో వర్మ పోస్టు చేశారు. అంతేగాక 'పోలీసులు ఎక్కడున్నారు.. థియేటర్లలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చూస్తున్నారనుకుంటా' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై వెంటనే స్పందించిన పోలీసులు.. ఆ వెహికిల్కు జరిమానా విధించారు. వెహికిల్ నంబర్ను టీఎస్ 07 జీపీ 2552గా గుర్తించిన పోలీసులు.. బండి యజమాని బద్దె దిలీప్ కుమార్కు 1300 రూపాయలు చలానా రాశారు. హెల్మెట్ లేకుండా బండి నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం కింద ఈ జరిమానాలు విధించారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm