హైదరాబాద్ : సరిహద్దుల్లో పాకిస్థాన్ బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా మోర్టార్లు, తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు శనివారంనాడు తెగబడ్డాయి. జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా మెంథార్ సెక్టార్పై జరిగిన ఈ దాడులను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టినట్టు రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదని, ఉదయం 9 గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. కాగా, కాల్పులతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురయ్యారని, వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm