హైదరాబాద్ : భారత్ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను ప్రతిష్ఠాత్మక హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సచిన్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సచిన్తో కలిసి గతంలో దిగిన ఫొటోతో కేటీఆర్ విషెష్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 87 మంది ఆటగాళ్లు ఇప్పటి వరకు హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకోగా మన దేశం తరఫున బిషన్ సింగ్ బేడీ (2009), కపిల్దేవ్ (2009), సునీల్ గవాస్కర్ (2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018) తో పాటు సచిన్ కు తాజాగా చోటుదక్కింది.
Mon Jan 19, 2015 06:51 pm