ముంబయి: తన తదుపరి చిత్రం 'మిషన్ మంగళ్' ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చంద్రయాన్-2 బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని జులై 22 ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. 'చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో సిద్ధం అవుతోంది. అలాగే మిషన్ మంగళ్ చిత్రానికి, ఆయన భవిష్యత్తు ప్రయత్నాలకు ఇస్రో బృందం తరఫు నుంచి ఆల్ది బెస్ట్' అని ఇస్రో ట్వీట్ చేసింది. దానిపై స్పందించిన అక్షయ్ కుమార్ 'కృతజ్ఞతలు, చంద్రయాన్-2 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో బృందానికి మరోసారి బెస్ట్ ఆఫ్ లక్' అని ఆయన సమాధానం ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm