హైదరాబాద్ : తిరుమల శ్రీవారి సేవాసదన్ విధుల్లో వున్న హోంగార్డు లావణ్యకు 60 వేలు విలువగల బంగారు చైను దొరకడంతో విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చి నిజాయితీ చాటుకుంది. శ్రీవారి సేవాసదనలో మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేసి పోగొట్టుకున్న భక్తురాలను గుర్తించి ఏవీఎస్వో వీర బాబు,విఐ దయకర్ రెడ్డి, జమేధర్ రాకేష్ రావులు ఆధ్వర్యంలో శ్రీవారి సేవకు గుంటూరు నుండి వచ్చిన రామలక్ష్మి చెందినదిగా గుర్తించి అందజేశారు మహిళా హోంగార్డు లావణ్యను రామలక్ష్మి అభినిందించారు.
Mon Jan 19, 2015 06:51 pm