హైదరాబాద్: ఏసీబీ మాజీ కానిస్టేబుల్ ఓంప్రకాశ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ప్రభుత్వ అధికారిని బెదిరించి లంచం తీసుకుంటూ నిందితుడు ఏసీబీకి చిక్కాడు. ఓం ప్రకాశ్ చేవెళ్ల సబ్రిజిస్ట్రార్ను బెదిరించి రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. హెచ్ఎండీఏ అధికారి పురోషోత్తంరెడ్డి కేసులో ఓం ప్రకాశ్ సస్పెండైయ్యాడు.
Mon Jan 19, 2015 06:51 pm