ఢాకా: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్కు ముందు బంగ్లాదేశ్కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ మష్రఫె మోర్తాజా గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో తమీమ్ ఇక్బాల్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఆల్ రౌండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. పేసర్ తస్కిన్ అహ్మద్, సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఫర్హాద్ రెజాలు వీరిద్దరి స్థానాలను భర్తీ చేయనున్నారు.
ఇక వ్యక్తిగత కారణాల కారణంగా ప్రపంచకప్ హీరో షకీబల్ హసన్, లిటన్ దాస్లు కూడా శ్రీలంక సిరీస్కు అందుబాటులో లేరు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మొసాద్దిక్ హొస్సైన్ మాట్లాడుతూ.. శ్రీలంక కంటే తాము అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్నట్టు చెప్పాడు. బ్యాటింగ్లో తాను ఏడో నంబరులోనే దిగుతానని స్పష్టం చేశాడు. కాగా, ఈ నెల 26న కొలంబోలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 20,2019 09:43PM