న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం నిగంబోధ్ ఘాట్లో జరిగాయి. సాధారణంగా ఆస్థాయి వ్యక్తులు మరణిస్తే వారి అంతిమ సంస్కారాలు ఎంత ఘనంగా జరుగుతాయో మనకు తెలిసిందే. కానీ షీలా దీక్షిత్ అంత్యక్రియలు మాత్రం అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా జరిగిపోయాయి. నిజానికి ఇది ఆమె కోరికట. ఢిల్లీలో కాలుష్యం పెరగకుండా ప్రకృతిని కాపాడేందుకు ఆమె కోరిక అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సీఎన్జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) పద్ధతిలో షీలా అంత్యక్రియలు జరిగాయి. ఇది కాలుష్య రహిత పద్ధతి. ఖర్చు కూడా ఎక్కువగా ఉండదు. ఇదే విధానంలో జరిగిన షీలా అంత్యక్రియల ఖర్చు అక్షరాల రూ.500. సాధారణంగా కట్టెలు ఉపయోగించి దహనం చేసినట్లయితే రూ.1,000 ఖర్చవుతుంది. అదికూడా మృతదేహం పూర్తిగా కాలడానికి 10-12 గంటల సమయం పడుతుంది. కానీ, సీఎన్జీ పద్ధతిలో అంతిమ సంస్కారాలు చేస్తే మృతదేహం గంటలో కాలిపోతుంది. అయితే షీలా అంత్యక్రియలు ఇలా చేయడాన్ని కొందరు వ్యతిరేకించారు. ఇది హిందూ సంప్రదాయం కాదని ఢిల్లీలోని కొందరు అర్చకులు అభ్యంతరం తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm