హైదరాబాద్: ముంబైలోని బాంద్రా ఎంటీఎన్ఎల్ (మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్) భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఎంటీఎన్ఎల్ లో విధులు నిర్వరిస్తున్న సిబ్బంది ప్రాణాలు కాపాడుకునేందుకు పై అంతస్థుపైకి వెళ్లారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని..మంటలను ఆర్పుతున్నారు. ఎంటీఎన్ఎల్ భవనంలోని పైఅంతస్థులో సుమారు 100 మంది చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు, రెస్క్యూ టీంతోపాటు వైద్య సేవల కోసం అంబులెన్స్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm