బెంగళూరు: సుప్రీం కోర్టులో తమ పిటిషన్పై మంగళవారం వాదనలు జరగవచ్చునని, సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో గట్టెక్కగలదని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు జరిగాయి. బలపరీక్ష ఎదుర్కొనేందుకు సీఎం కుమారస్వామి రెండు రోజుల సమయం కోరుతూ.. ఆయన స్పీకర్తో భేటీ అయ్యారు. రెబల్స్తో చర్చలు జరుపుతున్నామని అన్నారు. అయితే సీఎం అభ్యర్థనకు స్పీకర్ రమేష్ కుమార్ విముఖత చూపారు. ఈ సాయంత్రం 6 గంటలకు బలపరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తనకు ఎవరిపై పక్షపాతం లేదని సభాపతి రమేష్ కుమార్ అన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలకు విప్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం గవర్నర్ దృష్టికి వెళ్లకుండా సభలోనే పూర్తి చేస్తామని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm