సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బీజేపీ సీనియర్ నేత కల్రాజ్ మిశ్రా నియమితులయ్యారు. ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు హిమాచల్ ప్రదేశ్ 26వ గవర్నర్గా కల్రాజ్ మిశ్రా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీకే అగర్వాల్ , డీజీపీ ఎస్ మర్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కల్రాజ్ మిశ్రా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రిగా పనిచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm