గుంటూరు: అసెంబ్లీలో వైసీపీ నేతలు తప్పుడు డాక్యుమెంట్లు చూపెట్టి.. ప్రజలను మభ్యపెట్టి, టీడీపీని టార్గెట్ చేయాలని చూస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నీ వాళ్లే రాసుకుని సభలో చదువుతున్నారని విమర్శించారు. 'రాజశేఖర్ రెడ్డి చెబితే కియా వచ్చింది.. అది మేము నమ్మాలి'.. అంతేకదా.. మే నెలలో వరల్డ్ బ్యాంక్ మంజూరు చేసిన లోన్ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వచ్చిందని వాళ్లు చెబితే మేము నమ్మాలా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాము అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పలేదని, ఇదేనా విశ్వాసనీయత అని ఆయన ప్రశ్నించారు. తప్పులు చెప్పి, టీడీపీపై బుదర జల్లి, తప్పించుకుని తిరగాలంటే కుదరదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm