న్యూఢిల్లీ: ఈ మధ్యాహ్నం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయాన్ని చూసి దేశం పులకించిపోయింది. జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్తుంటే యావత్ భారతదేశం కళ్లార్పకుండా చూసింది. శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయానికి ఎల్లడెలా అభినందనలు వెల్లువెతుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇస్రోను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా, చంద్రయాన్-2 విజయంపై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఒకరినొకరు హగ్ చేసుకోవడాన్ని చూసేందుకు ఎదురుచూశానని ట్వీట్ చేశారు. శాస్త్రవేత్తలకు తాను నిలబడి శాల్యూట్ చేశానని పేర్కొన్నారు. ఇప్పుడు మన కొత్త సెలబ్రిటీలు వారేనని కొనియాడారు. ఈ ప్రయోగం మన క్రయోజనిక్ సాంకేతిక బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని పేర్కొన్నారు. అంతేకాదు, టెక్నాలాజికల్ బ్రేక్ త్రూగా దీనిని అభివర్ణించారు.
Mon Jan 19, 2015 06:51 pm