హైదరాబాద్ : మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తన రూ.1000 కోట్ల విలువైన ఆస్తులను తనకు అప్పగించాలని కోరారు. విచారణానంతరం గాలి జనార్దన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో ఈడీ జప్తు చేసిన ఆస్తులను తనకు అప్పగించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని, ఈ తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిందన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీం సైతం సమర్థించిందన్నారు. తన ఆస్తుల విడుదలలో ఈడీ జాప్యాన్ని వీడకుంటే న్యాయం కోసం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm