డిల్లీ: దేశ రాజధాని డిల్లీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లోని 11 వేర్వేరు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం సోదాలు చేపట్టింది. చిట్ఫండ్ కేసు దర్యాప్తులో భాగంగా పశ్చిమబెంగాల్, బిహార్, త్రిపుర, డిల్లీల్లో సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ప్రజలకు రూ.87 కోట్లు ఎగవేసిన చక్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు చెందిన పార్థ చక్రవర్తి ఇతరులపై ఉన్న కేసు దర్యాప్తులో భాగంగానే ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని నమ్మించి ప్రజల నుంచి డబ్బు తీసుకుని తిరిగి చెల్లించలేదని నిందితులపై ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm