సిరియా: సిరియా దేశంలో జరిగిన వైమానిక దాడుల్లో 20 మంది మరణించారు. ఇడ్లిబ్ ప్రావిన్సు పరిధిలోని మారెట్ అల్ నుమాన్లోని రద్దీ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులపై సిరియా, రష్యా దళాలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో 13 మంది ఉగ్రవాదులతోపాటు ఏడుగురు పౌరులు మరణించారని సిరియన్ మీడియా వెల్లడించింది. సిరియాలో అంతర్యుద్ధం వల్ల ఇప్పటికే 3,70,000 మంది మరణించగా, వేలాదిమంది జాడ లేకుండా పోయారు.
Mon Jan 19, 2015 06:51 pm