హైదరాబాద్: బిగ్బాస్ను నిలిపివేయకుంటే మహిళా, ప్రజా సంఘాలతో కలిసి పోరాటం నిర్వహిస్తానని యాంకర్, జర్నలిస్టు శ్వేతా రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటీ, యాంకర్ గాయాత్రి గుప్తా, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యతో కలిసి మాట్లాడారు. సినిమా తరహాలో బిగ్బాస్లో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుందని, మహిళల ఆత్మాభిమాన్ని కించపరిచేలా షోను నిర్వహిస్తున్నారన్నారు. తాను చేస్తున్న పోరాటానికి ప్రజాప్రతినిధులు, పార్టీలు, మహిళా, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తుందన్నారు. ఇప్పటికే నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైకోర్టును ఆశ్రయించారని, ఈ నెల 29 కేసు హియరింగ్ ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm