విశాఖపట్నం: రాష్రవ్యాప్తంగా 108 ఉద్యోగులు సోమ వారం రాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగారు. ప్రధానంగా వేతన బకా యిలు చెల్లించాలని, గత జీవీకే సంస్థ నుంచి ఒక్కొక్క ఉద్యోగికి రావలసిన రూ.70 నుంచి 80 వేల రూపాయలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో వున్న 43 వాహనాలలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పైలెట్లు (డ్రైవర్లు) కలిపి 193 మంది పనిచేస్తున్నారు.
వీరందరికీ రెండు నెలలుగా బీవీజీ సంస్థ నుంచి జీతాలు రావలసి ఉంది. అదేవిధంగా గతంలో 108 సేవలు నిర్వహించిన జీవీకే సం స్థ నుంచి ఒక్కొక్క ఉద్యోగికి రూ.70 నుంచి రూ.80 వేల వేతన బకాయిలు రావలసి ఉంది. ఈ బకాయిలు చెల్లిం చాలని కొన్ని నెలలుగా 108 ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తాజాగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభు త్వం కూడా సమస్య పరిష్కరించడం లేదంటూ సోమవారం రాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 23,2019 07:16AM