కడప: జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరం గ్రామానికి చెందిన జూనియర్ సైంటిస్ట్ అవ్వారు చందన శ్రీహరికోటలో నిర్వ హించిన చంద్రయాన్-2 రాకెట్ లాంచ్లో పాల్గొన్నారు. ఇస్రో నుంచి శ్రీహరి కోటకు రా వాలని సమాచారం రావడంతో హుటాహుటిన తిరుపతి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీహరికోట చేరుకుని చంద్రయాన్-2లో జరుగుతున్న పరిశోధనలు జూనియర్ సైం టిస్టులుగా చూడటం జరుగిందన్నారు. ప్రయోగాల మీద అవగాహన ఉండాలనే ఉద్దేశ్యంతో ఇస్రో శాస్త్రవేత్తలు జూనియర్ సైంటి స్టులకు ఆహ్వానం పలికినట్లు తెలిపారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చం ద్రయాన్-2కు జూనియర్ సైంటిస్టులకు ఆ హ్వానం రావడం జూనియర్ సైంటిస్టుగా ఎంపికైన అనంతరం దేశచరిత్రలోనే ప్రతిష్టా త్మకమైన చంద్రయాన్-2లో ప్రత్యక్షంగా వీక్షించడం తమ అదృష్టంగా భావిస్తున్నానని జూనియర్ సైంటిస్ట్ అవ్వారు చందన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm