తూర్పు గోదావరి: మలికిపురం మండలం గుడిమెళ్లంక దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్న వాహనం పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు మహిళ గల్లంతయ్యారు. వీరి కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. గల్లంతైన వారిలో సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన.. మేడూరి భార్గవి (5), కిరణ్మయి(4), పట్నాల కృప (23) ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm