భీవాండి: మహారాష్ట్రలోని బీవాండి నగరంలో ఉన్న కెమికల్ గోదాంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం జరిగిందన్న వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది తమ వాహనాలతో హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ముంబై నగరంలోని బాంద్రాలో ఉన్న మహానగర టెలీఫోన్ నిగం లిమిటెడ్ భవనంలో మంటలు అంటుకున్నాయి. ఈ అగ్నిప్రమాద సమయంలో కార్యాలయం బాల్కనీలో చిక్కుకున్న 84 మందిని క్రేన్ సాయంతో కాపాడారు. ఈ ఘటనలో అగ్నిమాపక శాఖ ఉద్యోగికి గాయాలవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm