వరంగల్: రైలులో నుంచి ప్రమాదవశాత్తు వ్యక్తి జారపడటంతో తీవ్ర గాయాలపాలైన ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది. సంగెం మండలం ఏల్గురు రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి బెల్లంపల్లి నుంచి సామర్లకోటకు రైలులో వెళ్తున్న మణికంఠ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడ్డాడు. దీంతో మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడని సంగెం పోలీసులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm